Showing posts with label Civics. Show all posts
Showing posts with label Civics. Show all posts

పంచాయతీరాజ్ ప్రకరణలు


పంచాయతీరాజ్ ప్రకరణలు

-ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ (1986):
1986లో రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పంచాయతీలను బలోపేతం చేయడానికి అవసరమైన సిఫారసులు చేయడానికి ఎల్‌ఎం సింఘ్వీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలని, గ్రామపంచాయతీలకు ఆర్థిక వనరులను కల్పించాలని, కొన్ని గ్రామ సముదాయాలకు న్యాయపంచాయతీలను ఏర్పాటు చేయాలని, గ్రామాలను పునర్‌వ్యవస్థీకరించాలని, గ్రామసభను ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహిస్తూ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక జ్యుడీషియల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సిఫారసులు చేసింది.

-ఆర్‌ఎస్ సర్కారియా కమిటీ (1988): క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించాలని, స్థానిక సంస్థలను రద్దుచేయడానికి సంబంధించి అన్ని రాష్ర్టాల్లోనూ ఒకేరకమైన చట్టాన్ని అమలు చేయాలని, పంచాయతీరాజ్‌కు సంబంధించిన అధికారాలను రాష్ర్టాలకు అప్పగించాలని, స్థానిక సంస్థలను ఆర్థికంగాను, విధులపరంగాను పటిష్టపర్చాలని, దేశానికంతటికీ అవసరమయ్యే పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించాలని ఈ కమిటీ పేర్కొంది.

-పీకే తుంగన్ కమిటీ (1988): గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సంబంధించిన పార్లమెంటు సంప్రదింపుల కమిటీ ఉపకమిటీ చైర్మన్ అయిన పీకే తుంగన్ అధ్యక్షతన ఈ కమిటీని 1988లో ఏర్పాటు చేశారు. దీన్ని పీకే తుంగన్ క్యాబినెట్ సబ్ కమిటీ అంటారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని, జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్ ప్రణాళికను అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది.

73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992
-ఎల్‌ఎం సింఘ్వీ, పీకే తుంగన్ కమిటీల సిఫారసుల మేరకు 64వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1989, మే 15న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో 2/3వ వంతు మెజారిటీ పొందినప్పటికీ, రాజ్యసభలో 2 ఓట్లు తక్కువకావడంతో ఈ బిల్లు వీగిపోయింది.
-తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం పంచాయతీలకు, పురపాలక సంఘాలకు సంబంధించిన ఉమ్మడి బిల్లును 1990, సెప్టెంబర్ 7న 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వం పడిపోవడంతో ఈ బిల్లు చర్చకు నోచుకోలేదు.
-తర్వాత పీవీ నర్సింహారావు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాల్సిన విషయాన్ని గుర్తించి 1991లో పంచాయతీలకు సంబంధించిన బిల్లును, మున్సిపాలిటీ (పురపాలక సంఘాలు)లకు సంబంధించిన బిల్లును వేర్వేరుగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.
-ఆ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికను 1992, డిసెంబర్ 22న పార్లమెంట్ ఆమోదించింది. తర్వాత ఆ బిల్లులను రాష్ట్ర శాసనసభల్లో ఆమోదం కోసం పంపారు. మెజారిటీ రాష్ట్ర శాసనసభలు (17 రాష్ర్టాలు) ఆ బిల్లులకు ఆమోదం తెలిపాయి.
-అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాల్‌శర్మ ఆ బిల్లులపై సంతకం చేశారు. దీంతో 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.
-పంచాయతీలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 24ను పంచాయతీ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
-పట్టణ, మున్సిపాలిటీలకు సంబంధించిన 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
-73వ రాజ్యాంగ సవరణ చట్టం- 1992 అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టం ప్రకారం పంచాయతీరాజ్‌ను మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1993, మే 10 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలో పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం కూడా కర్ణాటకే.

నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రకరణలు

-73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని రాజ్యాంగంలోని IXవ భాగంలో 243, 243(A) నుంచి 243(O) వరకు గల మొత్తం 16 ప్రకరణల్లో పొందుపర్చారు.
-73వ రాజ్యాంగ సవరణ, 7వ రాజ్యాంగ సవరణ చట్టం-1956 ద్వారా తొలగించిన IXవ భాగాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో కొత్తగా IXవ షెడ్యూల్‌ను కూడా చేర్చారు. పంచాయతీరాజ్ అంశం (స్థానిక సంస్థల పాలన, అధికారాలు) రాజ్యాంగంలోని VIIవ షెడ్యూల్‌లోని రాష్ట్ర జాబితాలో ఉంది.

ప్రకరణ 243 నిర్వచనాలు
1. జిల్లా అంటే ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం.
2. గ్రామసభ అంటే గ్రామస్థాయిలో పంచాయతీ పరిధిలోని ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో రిజిస్టర్ అయిన వ్యక్తుల సమూహం.
3. మాధ్యమిక స్థాయి అంటే జిల్లా స్థాయికి, గ్రామస్థాయికి మధ్యగల స్థాయి. దీనికి సంబంధించి ఏది మాధ్యమిక స్థాయిగా పరిగణిస్తారో గవర్నర్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేస్తారు.
4. పంచాయతీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో 243(B) ప్రకరణ కింద ఏర్పాటైన స్థానిక స్వపరిపాలనా సంస్థ.
5. పంచాయత్ ఏరియా అంటే ఒక పంచాయతీ ప్రాదేశిక ప్రాంతం.
6. జనాభా అంటే చివరిగా జనాభా లెక్కల సేకరణ జరిగి ప్రచురించిన జాబితాలో గల జనాభా.
7. గ్రామం అంటే గవర్నర్ ద్వారా గ్రామంగా నోటిఫై అయిన ప్రాంతం. అనేక గ్రామాలను కలిపి కూడా గ్రామంగా నోటిఫై చేసి ఉండవచ్చు.
-ప్రకరణ 243(A) గ్రామసభ: గ్రామస్థాయిలో గ్రామసభ తన అధికార బాధ్యతలను శాసనసభ నిర్దేశించినవిధంగా చెలాయిస్తుంది.
-ప్రకరణ 243B(1) ప్రకారం IXవ భాగంలోని నిబంధనలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రంలోనూ గ్రామ, మాధ్యమిక, జిల్లాస్థాయిల్లో పంచాయతీలను ఏర్పాటు చేయాలి.
-ప్రకరణ 243B(2) ప్రకారం 20 లక్షల జనాభా దాటని రాష్ర్టాల్లో మాధ్యమిక స్థాయిలో పంచాయతీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయనవసరం లేదు.
-ప్రకరణ 243C పంచాయతీల నిర్మాణం, ఎన్నికల గురించి తెలుపుతుంది.
-ప్రకరణ 243C(1) ప్రకారం పంచాయతీల నిర్మాణం గురించి శాసనసభ తగు నిబంధనలను రూపొందించాలి. పంచాయతీ పరిధిలోని జనాభా, ఆ పంచాయతీలో ఎన్నిక ద్వారా భర్తీ కావల్సిన సీట్ల మధ్య నిష్పత్తి వీలైనంతవరకు రాష్ట్రమంతా ఒకే విధంగా ఉండాలి.
-ప్రకరణ 243C(2) ప్రకారం పంచాయతీ స్థానాల నుంచి సభ్యుల ఎంపిక ప్రత్యక్ష ఎన్నిక ద్వారా జరుగుతుంది. అందుకు ప్రతి పంచాయతీని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తారు. ప్రతి నియోజకవర్గంలోని జనాభాకు, సీట్లకు మధ్యగల నిష్పత్తి కూడా వీలైనంతవరకు పంచాయతీ ఏరియా అంతటికీ ఒకే విధంగా ఉండాలి.
-ప్రకరణ 243C(3) ప్రకారం పంచాయతీలో ప్రాతినిధ్యానికి సంబంధించి శాసనసభ కింద పేర్కొన్న విధంగా శాసనాలను చేయవచ్చు.
1. గ్రామ పంచాయతీల అధ్యక్షులకు మాధ్యమిక పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం. మాధ్యమిక పంచాయతీలు లేని రాష్ర్టాల విషయంలో గ్రామపంచాయతీల అధ్యక్షులకు జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
2. మాధ్యమిక పంచాయతీల అధ్యక్షులకు జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
3. లోక్‌సభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులకు తమ నియోజకవర్గాల పరిధిలోగల మాధ్యమిక, జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
4. రాజ్యసభ, రాష్ట్ర శాసనపరిషత్తు సభ్యుల విషయంలో వారు ఓటరుగా ఎక్కడ నమోదయ్యారన్న అంశం ఆధారంగా మాధ్యమిక పంచాయతీలోగాని లేక జిల్లా పంచాయతీలోగాని ప్రాతినిధ్యం కల్పిస్తారు.
-ప్రకరణ 243C(4) ప్రకారం పంచాయతీ అధ్యక్షులకు, పంచాయతీ సభ్యులందరికీ (ప్రత్యక్షంగా ఎన్నికయ్యారా లేదా అన్నదాంతో సంబంధంలేకుండా) పంచాయతీ సమావేశాల్లో ఓటింగ్‌లో పాల్గొనే హక్కు ఉంటుంది.
-ప్రకరణ 243C(5) ప్రకారం గ్రామస్థాయిలో పంచాయతీ అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి శాసనసభ నిబంధనలు జారీచేస్తుంది. మాధ్యమిక, జిల్లా పంచాయతీల అధ్యక్షులను ఆయా పంచాయతీల్లోని ఎన్నికైన సభ్యుల నుంచి ఎన్నుకుంటారు.
-ప్రకరణ 243D పంచాయతీల్లో రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది.

రాజ్యాంగ పీఠికపై వివాదం

 



సెక్యులర్, సోషలిస్ట్ పదాల తొలగింపు వాదనపై వెల్లువెత్తిన విమర్శలు
చెన్నై/పాట్నా: రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలన్న మిత్రపక్షం శివసేన డిమాండ్‌పై చర్చకు సిద్ధమని ఎన్డీయే సర్కారు పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆ పదాలు లేని పాత రాజ్యాంగ పీఠిక చిత్రాన్ని ప్రచురించి ఓ ప్రకటన విడుదల చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ అంశంపై ప్రతిపక్షాలతోపాటు మిత్రపక్షం పీఎంకే కూడా కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. పలు ఇతర వర్గాలు కూడా కేంద్రం వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశాయి. విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ తమకు ఆ పదాలను తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలని శివసేన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

  ఈ అంశంపై చర్చ జరగాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూచించడంపై షాక్‌కు గురైనట్లు పీఎంకే పేర్కొంది. అభివృదే ్ధ ఎజెండాగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు దానికే కట్టుబడి ఉండాలని ఆ పార్టీ నేత ఎస్.రాందాస్ హితవు పలికారు. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. మోదీ సర్కారు అజెండాకు ఇది నిదర్శనమని, సమగ్రత విషయంలో బీజేపీపై ఇప్పటికే అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది.

Election of the President & Vice President: Electoral College


Election of the President
& Vice President: Electoral College
The Electoral College is a method of indirect popular election of the President of the United States. The authors of the Constitution put this system in place so that careful and calm deliberation would lead to the selection of the best-qualified candidate. Voters in each state actually cast a vote for a block of electors who are pledged to vote for a particular candidate. These electors, in turn, vote for the presidential candidate. The number of electors for each state equals its Congressional representation.
After Election Day, on the first Monday after the second Wednesday in December, these electors assemble in their state capitals, cast their ballots, and officially select the next President of the United States. Legally, the electors may vote for someone other than the candidate for whom they were pledged to vote. This phenomenon is known as the "unfaithful" or "faithless" elector. Generally, this does not happen. Therefore, the candidate who receives the most votes in a state at the general election will be the candidate for whom the electors later cast their votes. The candidate who wins in a state is awarded all of that state’s Electoral College votes. Maine and Nebraska are exceptions to this winner-take-all rule.
The votes of the electors are then sent to Congress where the President of the Senate opens the certificates, and counts the votes. This takes place on January 6, unless that date falls on a Sunday. In that case, the votes are counted on the next day. An absolute majority is necessary to prevail in the presidential and the vice presidential elections, that is, half the total plus one electoral votes are required. With 538 Electors, a candidate must receive at least 270 votes to be elected to the office of President or Vice President.
Should no presidential candidate receive an absolute majority, the House of Representatives determines who the next president will be. Each state may cast one vote and an absolute majority is needed to win. Similarly, the Senate decides who the next Vice President will be if there is no absolute majority after the Electoral College vote. Elections have been decided by Congress in the past. The House of Representatives elected Thomas Jefferson president in the election of 1800 when the Electoral College vote resulted in a tie. When the Electoral College vote was so split that none of the candidates received an absolute majority in the election of 1824 the House elected John Quincy Adams President. Richard Johnson was elected Vice President by the Senate when he failed to receive an absolute majority of electoral votes in the election of 1836.
The President-elect and Vice President-elect take the oath of office and are inaugurated two weeks later, on January 20th.

Constitution of India in Telugu






Constitution of India in Telugu Indian constitution pdf in Hindi  Indian constitution in Hindi  Indian constitution pdf  father of Indian constitution  article 15 of Indian constitution  salient features of indian constitution  Indian constitution articles  Indian constitution amendments indian constitution pdf in Telugu Indian constitution Constitution of India in Telugu Indian constitution pdf in Hindi  Indian constitution in Hindi  Indian constitution pdf  father of Indian constitution  article 15 of Indian constitution  salient features of indian constitution  Indian constitution articles  Indian constitution amendments indian constitution pdf in Telugu Indian constitution Constitution of India in Telugu indian constitution pdf in Hindi  Indian constitution in Hindi  Indian constitution pdf  father of Indian constitution  article 15 of Indian constitution  salient features of indian constitution  Indian constitution articles  Indian constitution amendments indian constitution pdf in Telugu Indian constitution

బాలల హక్కులు - బాధ్యతలు



బాలల హక్కులు - బాధ్యతలు
స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కులు మొదలైన వాటన్నిటికీ సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. వాటిని సాధించే క్రమంలో గొప్ప అనుభవాల్ని సంపాదించాం. కానీ, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కుల విస్తారంలోకి పిల్లల్ని చేర్చం.
నేటి ప్రజాస్వామ్య ప్రపంచంలో సైతం తల్లిదండ్రులు, టీచర్లు, పనిచేసేచోట్ల యజమానులు ఇంకా బయట ప్రతీచోటా పెద్ద వాళ్ళు పిల్లల్ని కొట్టటం, తిట్టటం, అవమానించటం, స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకోవడం, సరియైన ఆహారం అందించకపోవడం జరుగుతోంది, ఇది ఘోరమైన నేరం.
జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మానవహక్కుల దృక్పధం అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకొనిపోయింది. కానీ పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదన్నారు గనుక తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులూ ఉంటాయనుకునే దుష్టనీతి నుంచి మనం ఇంకా బయటపడలేదు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, బుద్ధి జీవులనబడే వాళ్ళు కూడా - దారిద్ర్యం, నిరుద్యోగం, వివక్షత వంటి పరిస్ధితుల్ని మూలకారణాలుగా పరిగణిస్తూ - పిల్లలకు చేస్తున్న అన్యాయాన్ని సమర్ధిస్తున్నారు.
అందుకే పిల్లల హక్కులు, పిల్లల సంరక్షణ అనే దృక్పథాలు బలపడటానికి ఒక బృహత్ ప్రచారం, ఒక ఉద్యమం అవసరమయ్యాయి. నేపధ్యంలోనే ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది. దీనికి ముందు కూడా పిల్లల హక్కులకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, ఒడంబడికలు, అనేక ప్రయత్నాలు, కార్యక్రమాలు జరిగినప్పటికీ ఒడంబడిక విశిష్టమైనది, విలక్షణమైనది, సమగ్రమైనది. ఇది పిల్లల పౌర రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు పూనుకున్న ఏకైక ఒప్పందం, అన్ని దేశాల్లోను, అన్ని పరిస్ధితుల్లోను పిల్లలందరికీ వర్తించే సార్వత్రిక ఒప్పందమిది. పరిమితవనరులున్న ప్రభుత్వాలు కూడా పిల్లల హక్కులు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించిన బేషరతు ఒప్పందమిది. రెండు దేశాలు తప్ప ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలన్నీ ఈఒడంబడికను ఆమోదించాయి. భారత ప్రభుత్వం 1992 డిసెంబరు 11 ఒడంబడికను ఆమోదించి సంతకం చేసింది.
తీర్మానంలో పేర్కొన్న బాలల హక్కుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, అలాగే పిల్లల హక్కుల్ని పరిరక్షించడానికి ఎవరికైనా హక్కునిస్తుంది. తీర్మానం.
మార్గదర్శక సూత్రాలు: అన్ని హక్కలకు సాధరణంగా ఉండే నియమాలు
ఆర్టికల్ - 1
  • ప్రస్తుత సదస్సు ప్రకారం 18 సంవత్సరాల వయసులోపు మానవులు బాలలుగా పరిగణించబడతారు
ఆర్టికల్ - 2
  • సదస్సులో తీర్మానించిన బాలల హక్కులను భాగస్వామ్య దేశాలు - పిల్లల తల్లిదండ్రుల, వారి సంరక్షకుల, కులం, జాతి, వర్గం, భాష, మతం, రాజకీయాభిప్రాయం, జాతీయత, తెగ, అంతస్తు, సామర్ధ్యం, పుట్టుక మరే ఇతర హొదాలను బట్టి వివక్ష చూపకుండా బాలలందరికీ సమానంగా అందించాలి.• పిల్లల తల్లిదండ్రుల, వారి చట్టబద్ధ సంరక్షకుల లేదా కుటుంబ సభ్యుల హొదా, కార్యకలాపాలు, వారి అబిప్రాయాలు లేదా నమ్మకాలను బట్టి పాటించే వివక్ష, శిక్షల నుండి బిడ్డను కాపాడేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకుంటాయి.
ఆర్టికల్ - 3
  • ప్రభుత్వంగానీ, ప్రైవేట్ సాంఘిక సంక్షేమ సంస్ధలుగానీ, కోర్టులుగానీ, పాలక సంస్ధలుగానీ లేదా బాలలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే సంస్ధలుగానీ అన్నింటికీ బిడ్డ ప్రయోజనాలే ముఖ్య కర్తవ్యంగా ఉండాలి.
  • భాగస్వామ్య దేశాలు బిడ్డ శ్రేయస్సుకు అవసరమైన శ్రద్ధ, సంరక్షణా బాధ్యత తీసుకోవాలి. దానితో పాటు బిడ్డ యొక్క తల్లిదండ్రుల, చట్టబద్ధ సంరక్షకుల, చట్టపరంగా బిడ్డకు బాధ్యులైన ఇతర వ్యక్తుల యొక్క హక్కులు విధులను దృష్టిలో పెట్టుకొని ఉంచుకోవాలి. అంతిమంగా అందుకోసం తగిన శాసనపరమైన, పాలనపరమైన చర్యలను తీసుకోవాలి.
  • బిడ్డల శ్రద్ధ, సంరక్షణకు ఉద్దేశించిన సంస్ధలు, సేవలు సదుపాయాలను నిపుణులు నిర్దేశించిన ప్రమాణాలను బట్టి ( ముఖ్యంగా ఆరోగ్యం పారిశుద్ధ్యం విషయంలో) పనిచేసే విధంగా భాగస్వామ్య దేశాలు జాగ్రత్త తీసుకోవాలి.
ఆర్టికల్ - 4
  • సదస్సులో గుర్తించిన హక్కులను అమలు జరపటం కోసం భాగస్వామ్య దేశాలు తగిన శాసనపరమైన, పాలకపరమైన కార్యక్రమాలను చేపట్టాలి. ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల విషయంలో భాగస్వామ్య దేశాలు తమ శక్తి మేరకు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అంతర్జాతీయ సహకారాన్ని తీసుకోవాలి.
ఆర్టికల్ - 6
  • జీవించే హక్కు బాలల జన్మహక్కుగా భాగస్వామ్య దేశాలు గుర్తిస్తున్నాయి.
  • పిల్లల మనుగడకు వారి అభివృద్ధికి భాగస్వామ్య దేశాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి.
ఆర్టికల్ - 12
  • అందుకోసం, జాతీయ చట్ట నిబంధనల పరిధిలో బిడ్డ ప్రత్యక్షంగాగానీ, వేరొక ప్రతినిధి ద్వారాగాన, ఒక సంస్ధ ద్వారాగానీ కోర్టులో పాలకవ్యవస్ధలో తన గోడు వినిపించుకొనే అవకాశం బిడ్డకు ఇవ్వబడుతుంది.
అభివృధ్ధి మరియు జీవించే హక్కు: జీవించేందకు ముఖ్యమైన హక్కు మరియు సంపూర్ణమైన గౌరవమైన జీవితం
ఆర్టికల్ - 7
  • బిడ్డ పుట్టగానే పేరు నమోదు చేయించుకునే హక్కు ఉంది. పుట్టగానే పేరు కలిగి ఉండే హక్కు ఉంది. జాతీయతను పొందే హక్కు ఉంది. వీలైనంత వరకు జ్ఞానం పొందే హక్కు ఉంది. తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు ఉంది.
ఆర్టికల్ - 20
  • కుటుంబ జీవనం కోల్పోయిన బిడ్డలకు, లేదా కుటుంబ వాతావరణంలో తమ ఇష్టాయిష్టాలకు అవకాశం లేని పిల్లలకు ప్రభుత్వం రక్షణ, సహాయం కల్పించాలి.
  • అలాంటి పిల్లలకు భాగస్వామ్య దేశాలు తమ జాతీయ చట్టాల ననుసరించి ప్రత్యామ్నయ సంరక్షణ కల్పించాలి.
  • రక్షణ అనేది బిడ్డ భద్రత కోసం - పోషణ స్ధానం, ఇస్లామిక్ చట్టంలో కఫాలా, ఇతర సమాజాల్లో దత్తత, ఇంటర్ ఏలియా మొదలైన అంశాలకూ సంబంధించి ఉంటుంది.
ఆర్టికల్ - 23
  • మానసికంగా, శారీరకంగా వికలాంగులైన పిల్లలు సంపూర్ణమైన గౌరవమైన జీవితాన్ని గడపాలి. వారి గౌరవాన్ని ఆత్మ విశ్వాసాన్ని పెంచాలి. అలాంటి శిశువుల జనజీవనంలో చురుకుగా పాల్గొనేలా వీలు కల్పించాలి. అది భాగస్వామ్య దేశాలు గుర్తించాలి.
ఆర్టికల్ - 24
అత్యున్నతమైన ఆరోగ్య ప్రమాణాలను పొందేందుకు - రోగానికి చికిత్స పొందేందుకు, ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు, బిడ్డకు ఉన్న హక్కును భాగస్వామ్య దేశాలు గుర్తించాలి. అలాంటి ఆరోగ్య సేవల్ని పొందే హక్కు నుండి బిడ్డా దూరం కాకుండా భాగస్వామ్య దేశాలు శ్రద్ధ తీసుకుంటాయి.
హక్కును దేశాలు అమలు చేసేందుకు భాగస్వామ్య దేశాలు పాటుపడతాయి. ప్రత్యేకించి -
  • శిశు మరణాలు, పిల్లల మరణాల్ని తగ్గించేందుకు,
  • ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేస్తూ పిల్లలలందరికీ అవసరమైన వైద్య సహాయం, ఆరోగ్య రక్షణలు కల్పించేందుకు,
  • ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు తగిన పౌష్టికాహారం, పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం ద్వారా, పర్యావరణ కాలుష్యం వల్ల ఏర్పడే ఇబ్బందులు ప్రమాదాలను గుర్తించడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని, వ్యాధులను ఎదుర్కొనేందుకు,
  • తల్లులకు ప్రసవానికి ముందు, ప్రసవానంతరం తగిన ఆరోగ్య సంరక్షణలు అందించేందుకు,
  • సమాజంలో అన్ని శాఖలకు ప్రత్యేకించి తల్లిదండ్రులకు, పిల్లలకు విద్య పొందేందుకు, పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం గురించిన ప్రాధమిక విజ్ఞాన్నాన్ని వినియోగించటంలో సహకరించేందుకు, తల్లి పాల వల్ల ప్రయోజనాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రమాదాల నివారణ గురించి వివరించేందుకు
  • వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
  • పిల్లల ఆరోగ్యం గురించిన సంప్రదాయ విధానాలను నిర్మూలించేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకోవాలి.
ఆర్టికల్ - 25
  • శారీరక, మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం సంబంధిత అధికారులు నిర్దేశించిన ఒక శిశువుకు చికిత్స చేసే క్రమంలో భాగస్వామ్య దేశాలు బిడ్డకు ఉన్న హక్కును ఇతర పరిస్ధితులను గుర్తించాలి.

Followers