'నేనెవరిని' అంటున్న 'బాహుబలి'


'nenevarini' antunna 'baahubali'



ఎట్టకేలకు 'బాహుబలి' ట్రైలర్‌ విడుదలైంది. హిందీలో కరణజోహార్‌ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. తెలుగులో ఉదయమే అన్ని థియేటర్లలో ట్రైలర్స్‌ వెళ్ళాయి. కాగా, విలేకరులకు ప్రత్యేకంగా ప్రసాద్‌మల్టీప్లెక్స్‌లో సోమవారంనాడు 4గంటలకు ట్రైలర్‌ చూపించారు. హాలీవుడ్‌ సినిమాను చూసిన రేంజ్‌లో ఆ ట్రైలర్‌ వుంది. డాల్బీ సౌండ్‌లో ఎఫెక్ట్‌గా అనిపించిన ఆ ట్రైలర్‌లో.. బాహుబలి పాత్రధారి ప్రభాస్‌ను ఓ సన్నివేశంలో కొండిపాంతంవారు చూసి గౌరవంగా నమస్కారం చేస్తుంటారు.. వీరంతా నాకెందుకు నమస్కారంపెడుతున్నారు.. అసలు నేనెవర్ని' అంటూ ప్రశ్నిస్తాడు. అమరేంద్రబాహుబలి వంశీయుడువు అంటూ వాయిస్‌ ఓవర్‌ వినిపిస్తుంది. ఇది ఓ రాజవంశానికి చెందిన చరిత్రగా చెప్పేశాడు. అప్పటి కాలంనాటి రాజవంశీయులు బానిన వ్యవస్థలు వంటి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలిసింది. తన వంశాన్ని నమ్ముకున్న ప్రజలకు బాహుబలి ఏంచేశాడనేది మొదటిపార్ట్‌గా కన్పిస్తుంది. కాగా, ఈచిత్రం జులై 12న విడదులచేయడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


శ్రీలంక తెరపై తమిళ కూటమి

శ్రీలంకలో మైనార్టీ తమిళులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు తమిళ రాజకీయ పార్టీలు కొత్త రాజకీయ కూటమిగా ఏర్పడాలని నిర్ణయించాయి. ఇప్పటి వరకూ తమిళులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన పార్టీ 'తమిళ జాతీయ కూటమి' దేశ ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో వున్న తమిళులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నదని పశ్చిమ ప్రావిన్స్‌లోని తమిళులకు చెందిన మైనార్టీ పార్టీ డెమొక్రాటిక్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ నేత మనో గణేశన్‌ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కూటమిలో భాగస్వాములు కాబోతున్న మరో రెండు పార్టీలు సెంట్రల్‌ హిల్‌ ప్లాంటేషన్స్‌ ప్రాంతానికి చెందినవని వివరించారు. తమిళులు కేవలం ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో మాత్రమే కాక పశ్చిమ, వాయవ్య, మధ్య, నైరుతి రాష్ట్రాల్లోనూ నివశిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ప్రాంత తమిళులకు టిఎన్‌ఎ ప్రాతినిధ్యం వహించటం లేదని అందువల్లే ఆయా ప్రాంతాలకు చెందిన తమిళ పార్టీలు నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కర్స్‌ (ఎన్‌యుడబ్ల్యు), కంట్రీస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (యుసిపిఎఫ్‌)లతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. భారత సంతతి తమిళులన్న మాటను నిలిపివేయాలని వారు కేవలం తమిళులు మాత్రమేనని
వారికి భారత సంతతి అన్న తోక ఎందుకని ఆయన ప్రశ్నించారు. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ కొత్త తమిళ కూటమి అధికార యుఎన్‌పికి చెందిన ప్రధాని రణిల్‌ విక్రమిసంఘేకు కీలకం కానున్నది. గణేశన్‌ దీర్ఘకాలంగా యుఎన్‌పి మిత్రుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

బంగ్లాతో మైత్రికి బలమైన సందేశం

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేకడెహ్రాడూన్‌: భారత్‌-బంగ్లా భూ సరిహద్దు ఒప్పందం బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం... ఆ దేశంతో భారత్‌ మైత్రికి బలమైన సందేశమని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై దేశమంతా ఏకతాటిపై నిలుస్తుందని ఇది సూచించిందని పేర్కొన్నారు. సోమవారమిక్కడ ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా చట్టసభల పనిదినాలు తక్కువగా నమోదవుతుండటంపట్ల ఆందోళన వ్యక్తంచేసిన ఆయన... సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించకూడదంటూ శాసనకర్తలకు సూచించారు. పార్లమెంటు, రాష్ట్ర శాసనవ్యవస్థలు ఏటా 100 రోజుల పనిదినాలను కలిగిఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో 'త్రీడీ': ప్రజాస్వామ్యంలో డిబేట్‌(చర్చ), డిస్సెంట్‌(భిన్నాభిప్రాయం), డెసిషన్‌(నిర్ణయం) అనే మూడు 'డీ'లు ఉండాలని ప్రణబ్‌ పేర్కొన్నారు. డిస్‌రప్షన్‌(అంతరాయం) అనే 'డీ' ఉండకూడదన్నారు. ప్రజలే తమ ప్రభువులన్న విషయాన్ని శాసనకర్తలు గుర్తుంచుకోవాలన్నారు.

బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పందానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ వారం బంగ్లాదేశ్‌ పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో భారత్‌-బంగ్లాదేశ్‌ భూ సరిహద్దు ఒప్పందం(ఎల్‌.బి.ఎ.)పై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. పొరుగు దేశంతో సంబంధాలు బలపరచుకునేందుకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. సరిహద్దుల్ని కొంతమేర మార్చుకునేందుకు 1974లోనే ఒప్పందంపై సంతకాలు జరిగాయి. బంగ్లాదేశ్‌ పార్లమెంటు దీనికి వెంటనే ఆమోదం తెలపగా, భారత పార్లమెంటు మాత్రం గత నెలలోనే ఆమోదించింది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు అయినప్పటికీ 50% రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాలనే నిబంధన దీనికి వర్తించదని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్ని నిర్ణయించుకోవడంతో పాటు భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు 17,160 ఎకరాల భూమి బదలాయింపునకు ఒప్పందం వీలు కల్పిస్తుంది. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు 7110 ఎకరాల భూమి లభిస్తుంది.

చార్మినార్‌ వద్ద ఉచిత వైఫై సేవలు ప్రారంభం

హైదరాబాద్‌: చార్మినార్‌ వద్ద ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఈ సేవలను ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ-2014 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో ఫలితాలను విడుదల చేశారు. గతనెల 9,10,11 తేదీల్లో ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్షలు జరిగాయి. మొత్తం 10,313 పోస్టులకు 3లక్షల 90వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఫలితాల విడుదల అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... అభ్యంతరాలన్నీ పరిశీలించి 13 పొరపాట్లను గుర్తించామని, నిపుణుల ద్వారా వాటిని సవరించి ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు.







 http://www.results.manabadi.co.in/


Tags : DSC 2015 Results 2015,DSC 2015 Biological Science Results,DSC 2015 Physics Results,DSC 2015 Science Results,DSC 2015 Maths Results,DSC 2015 SA Non Languages Results 2015,DSC 2015 SA Language Results 2015,AP DSC 2015 Results 2015,AP DSC 2015 Results 2015,AP DSC Secondary Grade Teachers Results 2015,DSC 2015 Urdu Language Pandit Special School Results,DSC 2015 Language Pandit Special School Results,DSC 2015 Languages Special 2015,AP DSC SGT Results 2015,Second Grade Teacher AP DSC Results 2015,AP DSC PET Results 2015,AP DSC Physical Education Teacher Results 2015, Schools9 AP DSC Results 2015 DSC 2015 DSC 2015 Results 2015,DSC 2015 Biological Science Results,DSC 2015 Physics Results,DSC 2015 Science Results,DSC 2015 Maths Results,DSC 2015 SA Non Languages Results 2015,DSC 2015 SA Language Results 2015,AP DSC 2015 Results 2015,AP DSC 2015 Results 2015,AP DSC Secondary Grade Teachers Results 2015,DSC 2015 Urdu Language Pandit Special School Results,DSC 2015 Language Pandit Special School Results,DSC 2015 Languages Special 2015,AP DSC SGT Results 2015,Second Grade Teacher AP DSC Results 2015,AP DSC PET Results 2015,AP DSC Physical Education Teacher Results 2015, Schools9 AP DSC Results 2015 DSC 2015

Followers