వాషింగ్టన్: టైమ్స మేగజైన్ చేపట్టిన ప్రతిష్టాత్మక పర్సన్ ఆఫ్ ది
ఇయర్ పోటీల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ స్థానంలో ఉన్నారు.
నవంబర్ 26వ తేదీ వరకు మొత్తం పోలైన ఓట్లలో 11.1 శాతం ఓట్లతో ఆయన తొలి
స్థానంలో ఉంటూ వచ్చారు. అప్పటి వరకు 8.8 శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో ఉన్న
ఫెర్గు్యసన్ ప్రొటెస్టర్సకు భారీ మద్దతు లభించడంతో మోడీ ద్వితీయ
స్థానానికి వచ్చారు. ఫెర్గు్యసన్లో నిరాయుధీయుడైన ఓ నల్లజాతి పౌరుడిని ఓ
శ్వేతజాతి పోలీసు అధికారి కాల్చి చంపిన సంఘటన అమెరికాను కుదిపేస్తోంది.
దీనికి నిరసనగా ఉద్యమకారులు ఈ బరిలో నిలిచారు. అయితే, సదరు పోలీసు అధికారి
పైన విచారణ చేపట్టేందుకు విస్తౄత న్యాయసమితి ససేమీరా అనింది. దీంతో,
ఫెర్గు్యసన్ ప్రొటెస్టర్సకు ఒక్కసారిగా భారీగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం
మోడీకి 9.8 శాతం, ఫెర్గు్యసన్ ఉద్యమకారులకు 10.8 శాతం ఓట్లు ఉన్నాయి.
హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యకారుడు జాషువా వాంగ్ మూడో స్థానంలో ఉన్నాడు.
నోబెల్ విజేత మలాలా నాలుగో స్థానంలో ఉంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమర్
పుతిన్ 5 స్థానంలో ఉండగా.. అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా బాగా
వెనుకబడ్డారు. ఆయన 11వ
స్థానంలో ఉన్నారు. డిసెంబర్ 6 వరకు ఈ పోల్ జరగనుంది. విజేతను 8వ తేదీన
వెల్లడిస్తారు. 10న టైమ్స మేగజీన్ సంస్థ ప్రకటన చేయనుంది. ఫెర్గూసన్
పోలీస్ రాజీనామా అమెరికాలో నల్ల జాతి యువకుడిని కాల్చి చంపిన తెల్లజాతి
పోలీస్ అధికారి డారెన్ విల్సన్(28) ఎట్టకేలకు రాజీనామా చేశారు. అయినా
నల్లజాతి ఉద్యమకారులు శాంతించడం లేదు. తమ ఉద్యమం డారెన్ ఉద్యోగం ఊడగొట్టడం
కోసం కాదని, బ్రౌన్కి న్యాయం జరిపించేందుకు పోరాడుతున్నామని, తక్షణం
డారెన్ని అరెస్టు చేసి శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. డారెన్
రాజీనామాను అధికారులు ఆమోదించారు.
అమెరికా పాత్రిేకయుని చంపిన అల్ ఖైదా తీవ్రవాదులు
కాబూల్ : యెమెన్లోని అల్ ఖైదా తీవ్రవాదులు తమ చెరలో బందీలుగా ఉన్న
అమెరికా పాత్రిేయుడు లూ్యక్ సోమర్సను, మరొక వ్యక్తిని హతమార్చారు. ఈ
ఇద్దరిని వారి నుంచి కాపాడేందుకు అమెరికా ప్రత్యేక కార్యనిర్వహణ దళా లు
శుక్రవారం రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయిందని అమెరికా రక్షణ శాఖ
మంత్రి చుక్ హాెగల్ కాబూల్లో పేర్కొన్నారు. అయితే, బందీలను కాపాడేందుకు
తాము చేసిన ప్రయత్నాలను ఆయన సమర్థించుకున్నారు. `అల్ ఖైదా తీవ్రవాదుల
చేతిలో బందీగా ఉన్న సోమర్ ప్రాణాలకు తీవ్ర అపా యం ఏర్పడింది. దీనితో ఆయనను
విడిపించేందుకు తాము రక్షణ చర్యలకు దిగవలసి వచ్చింది' అని హాెగల్
వివరించారు. యెమెన్ ప్రభుత్వ సహకారంతో తమ రక్షణ దళాలు తీవ్రవాదుల చెర
నుంచి బందీలను విడిపించే కార్యక్రమా న్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ
దాడిలో పలువురు అల్ ఖైదా తీవ్రవాదు లు కూడా మరణించినట్లు ఆయన తెలియజేశారు.
ఈ ఘటనలో తీవ్రవాదు లు చంపివేసిన మరొకరు దక్షిణాఫ్రికా దేశానికి చెందిన
వ్యక్తి అని తెలిసింది.
ఉగ్రవాద నిర్మూలకు భారత్తో సై: ఒబామా
వాషింగ్టన్ః
జమ్ము కాశ్మీర్లో శుక్రవారం మధ్యాహ్నం తీవ్రవాదులు మూడు ప్రాంతాలలో
దాడులు చేశారు. ఈ దాడుల్లో 11 మంది జవాన్లు, ఎనిమిది మంది తీవ్రవాదులు
ప్రాణాలుకోల్పోయారు. ఉగ్రవాదులు జరిపే దాడుల నిర్మూలకై భారత్తో కలిసి
పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా
వెల్లడించారు. సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదులు యూరీలోని ఆర్మీ క్యాంప్
సహా పలు ప్రాంతాలపై దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో ఒక
లెఫ్టినెంట్ కల్నల్ సహా 8 మంది సైనిక సిబ్బంది, ముగ్గురు పోలీసులు,
ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల ఎదురుదాడుల్లో లష్కరే
తోయిబా టాప్ కమాండర్ సహా 8 మంది ఉగ్రవాదులతో సహా మొత్తం 18 మంది
హతమయ్యారు. అలాగే పోపియాన్ ప్రాంతంలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్ మీద
ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. జమ్ము కాశ్మీర్
అసెంబ్లీ ఎన్నికలలో ఇప్పటి వరకు రెండు దశల పోలింగ్ పూర్తయింది. త్వరలో
ప్రధాని నరేంద్రమోడీ ఇక్కడ ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో
దాడులు జరిగిన నేపథ్యంలో జమ్ము కాశ్మీర్లో భద్రతా ఏర్పాట్లను మరింత
కట్టుదిట్టం చేశారు.
Subscribe to:
Posts (Atom)