సమాచారం... ఉద్యోగాలు


టెక్నికల్‌ సూపరింటెండెంట్‌లు అస్సాంలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ
 కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
- జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌లు-24-
ఇతర ఖాళీలు :
అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌-2,
మెడికల్‌ ఆఫీసర్‌-1,
వర్క్‌షాప్‌ సూపరింటెండెంట్‌-1,
అసిస్టెంట్‌ ఇంజనీర్‌-1,
 స్టాఫ్‌ నర్స్‌-1,
జూనియర్‌ అకౌంటెంట్‌-1,
మల్టీఫంక్షనల్‌ అసిస్టెంట్‌-2.

దరఖాస్తు : వెబ్‌ సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు,
చివరి తేదీ : ఆగస్టు 4
వెబ్‌సైట్‌ : www.cit.in

బార్క్‌లో అప్రెంటీస్‌షిప్‌ ముంబయిలోని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ట్రేడ్‌ అప్రెంటీస్‌షిప్‌ శిక్షణలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది

సీట్లు : 18 (మెకానికల్‌-8, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌-2, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌-4, ఎక్స్‌రే టెక్నీషియన్‌-2, ఆఫ్తాల్మిక్‌ టెక్నీషియన్‌-2)
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
 చివరి తేదీ : ఆగస్టు 31
వెబ్‌సైట్‌ : www.barc.gov.in


ఎయిమ్స్‌, న్యూఢిల్లీ న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 
 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది
ఖాళీలు : అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ -96- విభాగాలు : అనాటమీ, బయోఫిజిక్స్‌, బయోకెమిస్ట్రీ, సి.టి.వి.ఎస్‌, సెంటర్‌ ఫర్‌ కమ్యూనిటీ మెడిసిన్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఈ.ఎన్‌.టి, గ్యాస్ట్రోఎంటరాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెడిసిన్‌, న్యూరోసర్జరీ, మొదలైనవి.
వయసు : 50 ఏళ్లకు మించకూడదు
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
చివరి తేదీ : ఆగస్టు 14
వెబ్‌సైట్‌ : డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎయిమ్స్‌ఎక్జామ్స్‌.ఓఆర్‌జి

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రభుత్వ విభాగాల్లోని వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది 
 ఖాళీలు :అసిస్టెంట్‌ ఎపిగ్రాఫిస్ట్‌-3, డైటీషియన్‌-15, బోసన్‌-5, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-8, క్లర్క్‌-1, అసిస్టెంట్‌ మేనేజర్‌ కమ్‌ స్టోర్‌ కీపర్‌-1, ఫొటోగ్రాఫర్‌-1, జూనియర్‌ కార్టోగ్రాఫిక్‌ అసిస్టెంట్‌-1, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-21, అకౌంటెంట్‌-1, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-1, స్టోర్‌ సూపరింటెండెంట్‌-1, సీనియర్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌-4, చార్ట్‌మెన్‌-13, క్వారంటైన్‌ ఇన్‌స్పెక్టర్‌-3, డిప్యూటీ రేంజర్‌-3, సీనియర్‌ రేడియో టెక్నీషియన్‌-1.-
ఎంపిక :-కామన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ /ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్‌ / స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా
 దరఖాస్తు : ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
చివరి తేదీ : ఆగస్టు 14
వెబ్‌సైట్‌ : www.sscwr.net


సిల్వర్‌ వాటర్‌ అని దేనిని అంటారు?


జ్వరాన్ని చూసే థర్మా మీటర్‌ పగిలి పోయినప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చిన మెరిసే పదార్ధాన్ని గమనించారా? ఆ పదార్ధమే మెర్క్యూరీ. ఇది పట్టుకోవటానికి దొరకదు. జారి పోతుంది. దీన్నే పాదరసం అని అంటారు. ఇది ద్రవ రూపంలో ఉండే ఒక లోహం. ఇది అద్భుతంగా మెరుస్తుంది. డియోస్కొరైడ్స్‌ అనే శాస్త్రవేత్త హైడ్రార్జియం అనే సాంకేతిక నామాన్ని ఈ లోహానికి పెట్టాడు. అంటే లాటిన్‌ భాషలో సిల్వర్‌ వాటర్‌ (వెండి నీరు) అని అర్ధం. దీని రసాయన సంకేతం హెచ్‌.జి. అని గుర్తిస్తారు. ఈ లోహానికి మెర్క్యూరీ అనే పేరును రోమ్‌ పౌరులు పెట్టారు. ఈ లోహం నున్నటి నేలపై పడినప్పుడు దాన్ని చురుకైన కదలికలు తెలివికి, చురుకుతనానికి నిదర్శనంగా భావించే వారి దేవుడు మెర్క్యూరీని గుర్తుకు తెచ్చేవి. దాంతో ఈ లోహానికి మెర్క్యూరీ అని పేరు పెట్టడమే సరి అయినదని వారు భావించారు.

ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు ?




1. ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో కోటిలింగాల వద్ద దొరికిన నాణేలు ఎవరికి చెందినవి ? – శ్రీముఖుడు
2. శాతవాహనుల కాలంలో నగర పాలన ఎవరి ద్వారా జరిగేది ? - నిగమ సభ
3. ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో వారని అశోకుని ఎన్నో శిలాశాసనం తెలుపుతుంది ?- 13వ శిలా శాసనం
4.కవి వత్సలుడు అనే బిరుదున్న రాజు ? – హాలుడు
5. ధరణికోట శాసనం ఏ శాతవాహన రాజుకి సంబంధించింది ? - వాశిష్టిపుత్ర పులోమావి
6. శాతవాహనుల కాలంలో పల్నాడు ప్రాంతం దేనికి ప్రసిద్ధి ? – వజ్రాలు
7. శాతవాహనుల కాలం నాటి కొడాయిరాను ప్రస్తుతం ఎలా పిలుస్తున్నారు ? – ఘంటసాల
8. ఆంధ్రుల ప్రస్తావన మొట్టమొదటి సారి ఉన్న ఐతరేయ బ్రాహ్మణం ఏ వేదానికి సంబంధించింది ? – రుగ్వేదానికి
9. ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఎక్కడ ఉంది ? - కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం
10.గుణాఢ్యుడు రచించిన బృహత్కథ ఏ భాషలో ఉంది ? – పైశాచి
11.శాతవాహనుల కాలంనాటి తొలి గుహ చైత్యాలు ఎక్కడ ఉన్నాయి ? – గుంటుపల్లి
12.విష్ణు కుండినులు పోషించిన భాష ? – సంస్కృతం
13. మంచికల్లు శాసనం ఏ వంశ రాజుల గురించి తెలుపుతుంది ? – పల్లవులు
14. 108 శివాలయాలను నిర్మించిన చాళుక్యరాజు ? – రెండో విజయాదిత్యుడు

15. ఐవోల్‌ శాసనం ఎవరి విజయాలను గురించి తెలుపుతుంది ? - రెండో పులకేశి
16. ఉండవల్లి గుహలు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్నాయి ? - కృష్ణా
17.బైరవ కొండ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి ? - నెల్లూరు
18. విష్ణు కుండినుల రాజధాని ? - వినుకొండ
19.రేనాటి చోళుల మూల పురుషుడు ?- కరికాళ చోళుడు
20. శూన్య వాదాన్ని ప్రభోదించింది ? - ఆచార్యనాగార్జునుడు
21. ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజుల్లో ఎవరికి సమకాలికుడు ? - యజ్ఞశ్రీ పుత్ర శాతకర్ణి
22.శాతవాహనుల నాణేలను ఎలా పిలిచేవారు ? - కర్షపణలు
23. ప్రఖ్యాత శివలింగం గత చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం ఏ రాజుల కాలానికి చెందింది ? - శాతవాహనులు
24. చేజర్ల శిలాశాసనం ఏ రాజు వంశీయులను గురించి తెలుపుతుంది ? - ఆనంద గోత్రులు
25. జయవర్మ కొండముది శాసనం ఏ రాజు వంశీయులను గురించి తెలుపుతుంది ? - బృహత్పలాయనులు
26.సమస్త గాంధర్వ విద్యల్లో ప్రావీణ్యులైన చెల్లవ్యను పోషించిన రాజు? - మొదటి చాళుక్య భీముడు
27. నిర్వచనోత్తర రామాయణ గ్రంథకర్త ? - తిక్కన
28.ఆంధ్రదేశంలో హిందూ గుహాలయాలను మొట్టమొదటి సారిగా నిర్మించిన వారు ? - విష్ణు కుండినులు
29. ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు ? - మొదటి చాళుక్య భీముడు
30. తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు దేవాలయాల సముదాయాన్ని నిర్మించిన వారు ఎవరు ? - గుణగ విజయాదిత్యుడు
31. శాతవాహనుల వాణిజ్య సంబంధాలు ఏ దేశంతో అభివృద్ధి చెందాయి ? - రోమ్‌
32.శాతవాహన సామ్రాజ్యాన్ని అంతంచేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వంశం ? - ఇక్ష్వాకులు
33.యజ్ఞశ్రీ పుత్ర వాతకర్ణి వేయించిన నాణేలపై ముద్ర ? - నౌక
34.గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్‌, కార్లే శాసనాలు ఎవరి విజయాలను వివరంగా తెలుపుతాయి ?-గౌతమీ పుత్ర శాతకర్ణి
35. శాతవాహన రాజుల్లో ఘనుడు ? -గౌతమీ పుత్ర శాతకర్ణి
36. గాథా సప్తశతి గ్రంథ సంకలన కర్త ? - హాలుడు
37. నానాఘాట్‌ శాసనం ఎవరి విజయాలను గురించి తెలియజేస్తుంది ? - మొదటి శాతకర్ణి
38. సుహ్రృల్లేఖ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు ? - ఆచార్య నాగార్జునుడు
39. గిర్నార్‌ శాసనం వేయించిన రాజు ? - రుద్రదాముడు
40. ఇటీవల తవ్వకాల్లో కాల్చిన ఇటుకలతో నిర్మితమైన అతి పెద్ద బౌద్ధస్థూపాన్ని ఎక్కడ కనుగొన్నారు ? - నేలకొండపల్లి
41. శాతవాహన కాలంలో గ్రీకు, రోమన్ల ప్రభావం దేనిపై అధికంగా ఉండేది ? - వాస్తు శిల్పం
42. కళింగ రాజైన ఖారవేలుని సమకాలికుడైన శాతవాహన రాజు ? - రెండో శాతకర్ణి
43. మహాక్షాత్ర రుద్రదామునితో పోరాడిన శాతవాహన రాజు ? - గౌతమీ పుత్ర శాతకర్ణి
44. ఇటీవల భావికొండ వద్ద (భీముని పట్నం) బయటపడిన స్థూపాలు ఎవరి కాలానికి చెందినవి ? - శాతవాహనులు
45. శాలివాహన శకం ఎప్పుడు ప్రారంబమైంది ? - క్రీ.శ78లో

46.  విదేశీ బౌద్ధమత ఆధారాలతో ఆంధ్రదేశాన్ని ఏ విధంగా పేర్కొన్నారు ? - మంజీరక దేశం
47.  అశోకుడి శాసనాలు ఆంధ్రాలో లభించిన ప్రాంతాలు? – యర్రగుడి
48. ఇటీవల ఏలూరు ప్రాంతంలోని గుంటుపల్లిలో లభించిన శాసనం ఎవరి గురించి తెలుపుతుంది ? – ఖారవేలుడు
49. శాతవాహనుల సామ్రాజ్యంలోని రాష్ట్రాలు ? – ఆహారాలు
50. శాతవాహన కాలంలో వ్యాపార అభివృద్ధికి తోడ్పడింది ? – శ్రేణులు



51. కంటక శిల దేనికి పూర్వ నామము ? –ఘంటసాల
52.అలహాబాద్‌ స్తంభ శాసనంలో పేర్కొన్న శాలంకాయన రాజు ఎవరు ? – హస్తివర్మ
53. ఉజ్జయినీ రాకుమార్తెను వివాహమాడిన ఐక్ష్వాకు రాజు ఎవరు ? - వీర పురుషదత్తుడు
54. ఈపూరు, పొలమూరు శాసనాలు ఏ రాజు వంశస్తులను గురించి తెలుపుతాయి ? - విష్ణు కుండినులు
55. త్రికూట పూర్వతాధిపతులు ? – శాలంకాయనులు
56. నవబ్రహ్మ ఆలయాలు ఎక్కడ కొలువదీరి ఉన్నాయి ? -అలంపూర్‌
57. తెలుగులో కుమార సంభవ గ్రంథకర్త ఎవరు ? – నన్నెచోదుడు
58.మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లోని నవబ్రహ్మ ఆలయాలు ఏ రాజవశీయుల కాలానికి చెందినవి ? - పశ్చిమ (బాదామి) చాళుక్యులు
59. చోళ తూర్పు చాళుక్య రాజులను ఏకం చేసిన రాజు ? - రాజేంద్ర చోళుడు
60. ఆంధ్రాలో వీరశైవ రాజ్యాలను ఏకం చేసిన రాజు ? - రాజేంద్ర చోళుడు
61.ఆంధ్రాలో వీరశైవ మతాన్ని ప్రవేశపెట్టి ప్రచారం చేసిన వారు ? – పందితారాధ్యుడు
62. ఇక్ష్వాకుల రాజధాని ? – విజయపురి
63. ఏ రాజ వంశ కాలంలో ఆంధ్రదేశంలో బౌద్ధమతం విలసిల్లింది ? –ఇక్ష్వాకులు
64. జయవర్మ ఆంధ్ర రాజవంశాల్లో దేనికి చెందినవారు ? - బృహత్పలాయనులు65. శాలంకాయన రాజ్యస్థాపకుడు ఎవరు ? – విజయదేవవర్మ
66. శాలంకాయనుల రాజధాని ? – పెదవేగి
67. పల్లవులను ఓడించి దక్షిణాదికి తరిమివేసి కృష్ణానది దక్షిణ తీరప్రాంతాన్ని పాలించిన ఆంధ్ర దేశ రాజులు ? – ఆనందగోత్రులు
68.ఆనందగోత్రుల రాజధాని ? – కందరపురం
69. ఉండవల్లి గుహలయాలు నిర్మించిన రాజులు ? – విష్ణుకుండినులు
70. పల్లవుల రాజధాని ? – కాంచిపురం
71. పల్లవుల రాజ లాంఛనం ? – వృషభం
72. పల్వవ వంశ మూల పురుషుడు ? – వీరకూర్చవర్మ
73. మహాబలి (మామల్ల) పురం రేవు పట్టణాన్ని నిర్మించిన పల్లవరాజు ? - మొదటి నరసింహవర్మ
74. కులోత్తుంగ చోళ బిరుదాంకెతుడై గంగైకొండ చోళాపురం (చోళరాజ్యం)ను పాలించిన రాజేంద్రుడు ఎవరి కుమారుడు ? - రాజరాజ నరేంద్రుడు
75. తూర్పు చాళుక్యుల్లో సుప్రసిద్ధ రాజు ? - గుణగ విజయాధిపత్యుడు
76. తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు ? - కుబ్జ విష్ణువర్థనుడు
77. రాజారాజ నరేంద్రుని రాజ్య పరిపాలనా కాలం ? - క్రీశ.1019-1061
78. తూర్పు చాళుక్యుల రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరానికి ఎవరు మార్చారు ? - మొదటి అమ్మరాజు
79.శాలంకాయనుల ఆరాధ్య దైవం ? - చిత్రరథ స్వామి
80. వేంగి (తూర్పు) చాళుక్య రాజ్యస్థాపకుడైన కుబ్జ విష్ణువర్ణనుడు ఎవరి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించాడు ? - రెండో పులకేశి
81. రెడ్డి రాజుల రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకి మార్చిన రాజు ? - పెద్దకోమటి వేమారెడ్డి
82. నేలమల రాజధాని రాచకొండ ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది ? – నల్గొండ
83. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాభివృద్ధికి నిదర్శనం ? - ఉపాసిక బోధి శాసనం
84. ఆనంద గోత్రికులు ఎవరి సామంతులు ? – పల్లవులు
85. మొదటి హిందూ దేవాలయాన్ని కట్టించిన ఆంధ్ర వంశ రాజులు ? – ఇక్ష్వాకులు
86. బృహత్పలాయనుల గురించి తెలిపే ఒకే ఒక ఆధారం - కొండముది శాసనం
87.త్రికూట మలయాధిపతి అను బిరుదు ఎవరిది ? - రెండో మాధవ వర్మ
88.గూడూరు ఏ వంశరాజుల రాజధాని ? – బృహత్పలాయనులు
89. తూర్పు చాళుక్య రాజుల్లో సుప్రసిద్ధుడు ? - గుణగ విజయాదిత్యుడు
90. తొలి చాళుక్యుల నాటి కుడ్య చిత్రాలు (పెయింటింగ్స్‌) ఎక్కడ లభ్యమయ్యాయి ? - అజంతా
 

Followers