పంచా యతీ సెక్రటరీ పరీక్ష కటాఫ్ ఎంత...? 2014


ఆదివారం(ఫిబ్రవరి 23న) జరిగిన పంచాయతీ సెక్రటరీ పోస్టు పరీక్ష కటాఫ్ ఎంత ఉండవచ్చు -వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్ష ఫలితాలు పునరావతం అవుతాయా -అన్న ప్రశ్న పరీక్ష రాసిన అభ్యర్థుల మదిని తొలుస్తోంది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల విషయనిపుణులు, వీఆర్వో పరీక్ష విజేతల అభిపాయ్రాలతో కటాఫ్‌పై అందిస్తున్న విశ్లేషణ.... రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పంచాయతీసెక్రటరీ పరీక్షకు సుమారు ఆరులక్షల మందికి పైగా హాజరయ్యారు. కానీ దీనిలో సీరియస్‌గా పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య లక్షలోపే ఉంటుంది..! రెండు పేపర్లను పోటీపరీక్ష నిపుణులు నూతనకంటి వెంకట్ విశ్లేషిస్తూ... పేపర్ -1 : జనరల్ స్టడీస్ ప్రశ్నలు సిలబస్‌కు భిన్నంగా వచ్చాయన్నారు. ఈ విధంగా రావడంపై పలువురు అభ్యర్థులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తం జీఎస్ ప్రశ్నల్లో 90 శాతం ప్రశ్నలు అందరికీ అనుకూలంగా వచ్చాయి. అంటే సుమారు 113 ప్రశ్నలు సాధారణస్థాయిలో ఉన్నాయి. దీనిలో 100 మార్కులు తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక డాటా ఇంట్రప్రిటేషన్, మెంటల్ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్ విభాగాల కింద అడిగిన ప్రశ్నలు అభ్యర్థుల విజయాన్ని శాసిస్తాయి. రీజనింగ్ విభాగంలో కొంత కఠినమైన ప్రశ్నలు, లాజికల్‌స్కిల్స్‌లో యావరేజ్‌స్థాయిలో ప్రశ్నలు వచ్చాయి. వీటిలో ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత మంచి ర్యాంకు వస్తుంది.మొత్తం మీద 150 మార్కులకు గాను 130 పైగా సాధిస్తేనే ఉద్యోగావకాశాలు ఉంటాయి. పేపర్ -2: రూరల్‌డెవలప్‌మెంట్‌పై కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పేపర్ అభ్యర్థులను అంతగా భయపెట్టలేదు. దీనిలో అడిగిన ప్రశ్నలు వాస్తవరూపంలో కనిపించేవి కావడం విశేషం. అభ్యర్థి ఉద్యోగంలో చేరిన తర్వాత చేయాల్సిన విధులపై కావల్సిన ప్రాథమిక సమాచారాన్ని అడగడం మంచి పరిణామం. దీనిలో అకౌంట్స్‌పై అడిగిన ప్రశ్నల్లో 15 వరకు సాధారణస్థాయిలో ఉన్నాయి. మిగిలిన 10 ప్రశ్నలు కఠినస్థాయిలో ఉన్నాయి. ఓవరాల్‌గా పరిశీలిస్తే ఈ పేపర్‌లో కూడా 125 - 135 మార్కులు సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. సగటు అభ్యర్థిని దష్టిలో ఉంచుకొని పేపర్స్ తయారుచేశారు. ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ పరిక్షించేవిధంగా ఉండడంపై అభ్యర్థులు, విద్యావేత్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ పేపర్లలో కొన్ని ప్రశ్నలు రిపీట్ కావడం గమనార్హం. అదేవిధంగా మెంటల్‌ఎబిలిటీ ప్రశ్నలస్థానంలో అరిథ్‌మెటిక్ ప్రశ్నలు అడగడంపై అభ్యర్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తం మీద రెండు పేపర్స్‌లో కలిపి జనరల్ అభ్యర్థులకు 270పైగా మార్కులు వస్తేనే ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇటీవల విడుదల చేసిన వీఆర్వో, వీఆర్‌ఏ ఫలితాల వలే సెంట్ మార్కులు కూడా వచ్చే అవకాశం ఉందని కొంతమంది పరీక్ష రాసిన అభ్యర్థులు పేర్కొంటుండం గమనార్హం. ఏదేమైనా ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే

గుణకారం వద్దు- లాజిక్ చాలు


1135x35795x5385x4275=? పై సమీకరణంలో చివరి రెండు అంకెలేవీ? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే, మొత్తం గుణించాల్సిన అవసరం లేదు. ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంతకు ముందు, 5 ఒకట్ల స్థానంలో ఉన్నప్పుడు, దానికి ముందు, అంటే పదులు లేదా వందల స్థానాల్లో సరి లేదా బేసి సంఖ్యలు ఉన్నప్పుడు, వచ్చే జవాబులను పరిశీలిస్తే, తేలిగ్గా సమాధానం కనుగొనేందుకు వీలుంటుంది. కింది మూడింటిని పరిశీలించండి..... 1. 25x25=625, 2. 35x35=1225. 3. 15x 25=375 ఇందులో మొదటి సమీకరణంలో ముందు, రెండు ఉంది, అది సరి సంఖ్య, ఈ సమీకరణంలో వచ్చిన జవాబు 625. దీనిలో గుర్తించాల్సింది ఏంటంటే, అయిదుకు ముందు, సరి సంఖ్య ఉంటే, అ రెండు సంఖ్యలను గుణిస్తే, వచ్చే జవాబులో చివరి రెండు సంఖ్యలు 25 అయి ఉంటాయి. 45X45, లేదా 65x65, ఇలా ఏ సమీకరణాన్ని తీసుకున్నప్పటికీ సమాధానంలో చివరి రెండు సంఖ్యలు 25 ఉంటాయి. అదే విధంగా రెండో సమీకరణం 35x35, దీని జవాబులోనూ చివరి రెండు అంకెలు 25గానే ఉన్నాయి. దీని ఆధారంగా గుర్తించాల్సిన అంశం ఏమిటంటే, ఒకట్ల స్థానంలో ఉండి, దానికి ముందు, అంటే పదులు లేదా వందల స్థానంలో సరి లేదా బేసి సంఖ్యలు ఉంటే, వచ్చే బ్దంలో చివరి రెండు అంకెలు 25గా ఉంటాయి. ఇప్పుడు మూడో సమీకరణాన్ని పరిశీలిస్తే, ఒక దానిలో అయిదుకు ముందు బేసి సంఖ్య (15), మరో దానిలో అయిదుకు ముందు సరిసంఖ్య (25), ఉంది, ఇలా రెండు విభిన్న సంఖ్యలు ఉన్నప్పుడు వచ్చే ఫలితంలో చివరి రెండు అంకెలు 75 అయి ఉంటాయి. ఈ మూడు అంశాల ఆధారంగా పైన ఇచ్చిన సమీకరణంలో సమాధానాన్ని అత్యంత తేలిగ్గా కనుక్కోవచ్చు. 1135x35795x5385x4275=? ఇందులో నాలుగు సంఖ్యలు ఉన్నాయి. మొదటిది 1135, ఇందులో అయిదుకు ముందు 113 ఉంది, ఇది బేసి సంఖ్య, అలాగే రెండో సంఖ్య, 35795, ఇందులో అయిదుకు ముందు 3579 ఉంది, ఇది బేసి సంఖ్య. ఈ రెండు సంఖ్యలను గుర్తిస్తే, ఖచ్చితంగా చివరి రెండు అంకెలు 25 అయి ఉంటాయి (ఇంతకు ముందు చెప్పినట్లు, అయిదుకు ముందు రెండు బేసి సంఖ్యలు ఉన్న పక్షంలో ఫలిత లబ్ధంలో చివరన 25 ఉంటుంది.) ఇప్పుడు చివరి రెండు సంఖ్యలను పరిశీలిస్తే, 5385, అయిదుకు ముందు 538 ఉంది, ఇది సరి సంఖ్య, దీనిని 4275తో గుణించాలి, ఈ సంఖ్యలో 5 కు ముందు 427 ఉంది, ఇది బేసి సంఖ్య, కాబట్టి , చివరి రెండు పదాలను గుణిస్తే, వచ్చే ఫలిత లబ్ధంలో చివరి రెండు పదాలు 75 అయి ఉంటాయి. (ఇంతకుముందు పేర్కొన్నట్లు సరి, బేసిలు ఉండి, చివరన అయిదు ఉంటే, వాటి ఫలిత లబ్ధంలో చివరన 75 ఉంటుంది.) ఇప్పుడు తొలి రెండింటి లబ్ధం 25 కాగా చివరి రెండు అంకెల లబ్ధం 75. వీటిని గుణిస్తే, కచ్చితంగా అంతిమ సంఖ్యలు7,5లు వస్తాయి.. ఎందుకంటే సరి, బేసిలు ఉండి, చివరన అయిదు ఉంటే, వాటి ఫలిత లబ్ధంలో చివరన 75 ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాం. అయిదుకు ఉన్న ఈ ప్రత్యేకతని ఇలా తేలిగ్గా అర్థం చేసుకుంటే, చాలా తేలికగా సమాధానాలు గుర్తించొచ్చు. అయిదుతో తేలిగ్గా వర్గాలు కనుగొనే మరో టెక్నిక్‌ను పరిశీలిద్దాం. 25x25=625, 55x55=3025. చివరన అయిదు ఉన్న ఏ సంఖ్యావర్గమైనా అంతకు ముందు ఉన్న పదానికి ఒకటి కలిపి గుణించాలి, అంటే 55x55లో, చివరి రెండు పదాలు 25, తెలిసిందే, పదుల స్థానంలో 5 ఉంది కాబట్టి, అయిదును, దాని తర్వాత వచ్చే 6తో గుణించాలి, 5x6=30, కాబట్టి మొత్తం సమాధానం 3025 అవుతుంది. 75x75, దీనికి సమాధానం నేరుగా 7x8 చేయాలి(ఎందుకంటే పదుల స్థానంలో 7 ఉంది కాబట్టి), దీనికి జవాబు 5625. నియమంః గుణించాల్సిన రెండు సంఖ్యల ఒకట్ల స్థానంలో ఉన్న రెండు అంకెల మొత్తం 10 అయి ఉండి, దానికి ముందు ఉన్న సంఖ్యలు సమానంగా ఉండే అన్ని సంఖ్యలకు ఈ నియమం వర్తిస్తుంది. ఉదాహరణకు.. 72x78=, ఇందులో ఒకట్ల స్థానంలో ఉన్న 8, 2 లను కలిపితే 10 వస్తుంది, అలాగే పదుల స్థానంలో రెండింటిలోనూ ఒక అంకె, 7 ఉంది కాబట్టి, దీనికి కూడా ఈ నియమం వర్తిసుంది, కాబట్టి దీని జవాబు, 8x2=16, 7x8=56, 5616. 93x97=, 9021. పెద్ద సంఖ్యలో, ఒకట్లు, పదుల స్థానాల్లో ఉండే అంకెల మొత్తం, 100 అయితే ఈ నియమం కొంచెం మార్చి, అనువర్తింప చేసుకోవచ్చు. ఎలాగంటే.... 298x202=?, ఇందులో 98 (మొదటి సంఖ్యలోనివి), 02 (ండో సంఖ్యలోనివి)కలిపితే 100 వస్తుంది, దీనికి సమాధానం గుర్తించాల్సిన తీరు... 98x02=196 ఇందులో మనకు నాలుగు అంకెలు ఉన్నాయి అవి, 9, 8, 0, 2. కాని వచ్చిన సమాధానంలో 196లో మూడు అంకెలే ఉన్నాయి, కాబట్టి దీనికి ముందు 0ను చేర్చాలి, అంటే మన సమాధానంలో చివరి నాలుగు అంకెలు 0196, ఇప్పుడు వందల స్థానంలో ఉన్న 2, ఆ తర్వాత వచ్చే, 3తో గుణించగా, సమాధానం 6వస్తుంది, కాబట్టి మొత్తం జవాబు 60196. మరో ఉదాహరణ పరిశీలిద్దాం 3996x3004=? 996, 004 కలిపితే, మొత్తం 1000 అవుతుంది. ఇందులో 996 ను రెండో అంకెలోని ఒకట్ల స్థానంలో ఉన్న నాలుగుతో గుణించగా, 398ని రెండో సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్న నాలుగుతో గుణిస్తే సమాధానం 3984 వస్తుంది, ఇందులో నాలుగు అంకెలు ఉన్నాయి. కాని మనకు మొత్తం పదాలు, 9, 9, 8, 0, 0, 4. మొత్తం ఆరు అంకెలు ఉన్నాయి కాబట్టి, 3984కు ముందు, రెండు సున్నాలను చేర్చుతాం, ఆ తర్వాత, వేల స్థానంలో రెండు సంఖ్యల్లోనూ మూడు ఉంది కాబట్టి, మూడును ఆ తర్వాత సంఖ్య అయిన నాలుగుతో గుణిస్తే, 12 వస్తుంది, కాబట్టి మొత్తం సమాధానం 12003984. ఇప్పుడు, ఈ సంఖ్యకు సమాధానం నోటితో చెప్పండి, 998x902=.....


Followers